తిరుపతి : శిల్ప మృతిపై రుయా ఆసుపత్రి ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి వైద్యులు శనివారం ఆందోళన చేపట్టారు. ఇటీవల శిల్ప అనే వైద్యురాలి ఆత్మహత్యపై సమావేశమై ప్రొఫెసర్లు, ప్రిన్సిపల్ ను బాధ్యులు చేయడం సరైంది కాదని నిర్ణయించారు. శిల్ప మృతిపై జ్యుడీషియల్ విచారణ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వైద్యులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.