కొలంబో : భారత మత్స్యకారులు 27 మందిని శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేసినట్లు శ్రీలంక నౌకాదళం అధికారులు తెలిపారు. చేపలు పట్టేందుకు తమ పరిధిలోని డెల్ఫ్ దీవుల్లోకి అక్రమంగా వచ్చినందుకు అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మత్స్యకారుల నుంచి నాలుగు నాటు పడవలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది