ఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్గా ఎన్డీయే కూటమి అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. అధికార పక్షాల అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్.. విపక్షాల అభ్యర్థి బి.కె. హరిప్రసాద్పై 17 ఓట్ల తేడాతో విజయం సాధించారు. హరివంశ్ నారాయణ్ సింగ్కు 122 ఓట్లు.. బి.కె. హరిప్రసాద్కు 105 ఓట్లు పోల్ అయ్యాయి. టీఆర్ఎస్ ఎన్డీయే అభ్యర్థికి ఓటేయగా.. టీడీపీ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసింది.. కాగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు వైసీపీ దూరంగా ఉంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్గా ఎన్నికైన హరివంశ్ నారాయణ్ సింగ్ కు ప్రధాని అభినందనలు తెలియజేశారు.