ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం పూర్తి వివక్ష చూపుతోందని టీడీపీ ఎంపీలు అన్నారు. ఈరోజిక్కడ మాట్లాడుతూ ఫిబ్రవరి 9న వెనుకబడిన జిల్లాలకు రూ.350 కోట్లు విడుదల చేశారని, వారం రోజుల్లోనే ప్రధాని కార్యాలయం చెప్పిందని వెనక్కి తీసుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ పట్ల పూర్తి వివక్ష చూపుతున్నారనడానికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. యూసీలు అందించడంలో దేశంలోనే ఏపీ 3వ స్థానంలో ఉందన్నారు. యూసీలు ఇవ్వలేదంటూ బీజేపీ నేతలు అబద్దాలు చెబుతున్నారని పేర్కొన్నారు. బుందేల్ఖండ్, కేబీకే తరహాలో ప్యాకేజీ అమలు చేస్తామని తెలిపారన్నారు. ప్యాకేజీ అమలు చేసినట్లయితే రూ.22వేల కోట్లు విడుదల చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లాకు రూ.50 కోట్లు మాత్రమే ఇస్తున్నారని ఎంపీలు పేర్కొన్నారు.