ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్‌టెల్‌ మరో బంపర్‌ ఆఫర్‌

Andhra Pradesh Telugu |   | Published : Mon, Mar 06, 2017, 05:20 PM

ముంబయి: రిలయన్స్‌ జియోను తట్టుకునేందుకు ఇతర టెలికాం సంస్థలు భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తమ నెట్‌వర్క్‌ను వినియోగదారులను వదలి వెళ్లిపోకుండా ఉండేందుకు అవకాశం ఉన్న మేరకు తరచూ ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. దేశీయ అతి పెద్ద మొబైల్‌ నెట్‌వర్క్‌ అయిన ఎయిర్‌టెల్‌ తాజాగా మరో బంపర్‌ ఆఫర్‌తో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో డేటాకు సంబంధించిన ప్రత్యేక ప్లాన్‌తో ఎయిర్‌టెల్‌ ముందుకు వచ్చింది. రూ.345కే 28 జీబీ డేటాను అందించనున్నట్లు ప్రకటించింది. 28 రోజుల పాటు చెల్లుబాటయ్యే ఈ ప్యాక్‌లో ఉచిత వాయిస్‌ కాల్స్‌(లోకల్‌+ఎస్టీడీ) చేసుకునే వెసులుబాటునూ అందిస్తోంది.ఇటీవల జియో టారిఫ్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే. జియో ప్రైమ్‌ ఆఫర్‌లో రూ.303తో రీఛార్జ్‌ చేయడం ద్వారా ఉచిత వాయిస్‌ కాల్స్‌తో పాటు రోజూ 1జీబీ డేటాను (నెలరోజులు)పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ తాజా ఆఫర్‌ను తీసుకొచ్చింది. అయితే డేటా వినియోగం విషయంలో చిన్న మెలిక పెట్టింది. ఈ ఆఫర్‌తో రీఛార్జ్‌ చేసుకున్న ఎయిర్‌టెల్‌ వినియోగదారులు 500 ఎంబీని రోజులో ఏ సమయంలోనైనా వినియోగించుకోవచ్చు. మరో 500 ఎంబీ అర్ధరాత్రి 12గంటల నుంచి ఉదయం 6గంటల మధ్య మాత్రమే వినియోగించుకునే వెసులుబాటును కల్పించింది. ఇటీవల ఎయిర్‌టెల్‌ దేశీయంగా రోమింగ్‌ ఛార్జీలను ఎత్తివేసిన సంగతిత తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com