ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సభలోనే మోదీని ఆలింగనం చేసుకున్న రాహుల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 20, 2018, 02:36 PM

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. లోక్‌సభలో ప్రధాని మోదీని ఆలింగనం చేసుకున్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా మాట్లాడిన రాహుల్.. తన ప్రసంగం ముగిసిన తర్వాత .. మోదీ వద్దకు వెళ్లి ఆయనకు విషెస్ చెప్పారు. షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ తర్వాత మోదీని హగ్ చేసుకున్నారు. రాహుల్ స్టంట్ సభలో ఉన్న సభ్యులందర్నీ షాక్‌కు గురిచేసింది. మీ దృష్టిలో నేను పప్పూనే కావచ్చు, నాపై మీకు చాలా ద్వేషం ఉంది, కానీ నాకు మీ మీద కోపం లేదు అని రాహుల్ గాంధీ అన్నారు. 


అంతకముందు తన ప్రసంగంలో ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో రాహుల్ విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. భిన్నమైన రాజకీయవేత్తలు అని అన్నారు. ఆ ఇద్దరూ మన లాంటి వాళ్లు కాదు అని, గెలవడం ఓడిపోవడాన్ని మనం స్వాగతిస్తాం, కానీ ఆ ఇద్దరూ అధికారాన్ని కోల్పోవడాన్ని సహించరు అని రాహుల్ అన్నారు. అధికారం పోతుందన్న భయంతో.. ఇద్దరూ ఆగ్రహంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com