న్యూఢిల్లీ : ఆంధ్ర్రప్రదేశ్ 21వ శతాబ్దపు రాష్ట్రం అని కాంగ్రెస్ అధినేత్రి రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభలో అవిశ్వాసంపై చర్చలో పాల్గొన్న ఆయన గల్లా ప్రసంగంలో బాధ ఉందన్నారు. ఆయన మాట్లాడిన ప్రతి అంశం వాస్తవమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ చేసిన గారడి దాడులతో ప్రజలు గాయపడ్డారని రాహుల్ అన్నారు. నోట్ల రద్దుతో ప్రధాని గాయం చేశారని సూరజ్ వ్యాపారులు చెప్పారు. మోడీ ప్రధాని అయ్యాకా ఐదురకాల జీఎస్టీలు తెచ్చారని రాహుల్ గాంధీ అన్నారు. మోడీ గారడీ దాడులలో దేశ రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 21 శతాబ్దపు రాజకీయ బాధిత రాష్ట్రమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. టిడిపి ఎంపి గల్లా జయదేవ్ ప్రసంగాన్ని జాగ్రత్తగా విన్నానని, ఆయన ప్రసంగంలో బాధ కనిపించిందని రాహుల్ అన్నారు. గల్లా జయదేవ్, బిజెపి సభ్యుడు రాకేష్ సింగ్ ప్రసంగాలు ఆసక్తికరంగా సాగాయన్నారు.