లోక్ సభలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చ ప్రారంభించిన గల్లా జయదేవ్ తన ప్రసంగాన్ని ముగించిన అనంతరం అధికార పక్ష సభ్యుడు రాకేష్ సింగ్ ప్రసంగిస్తున్నారు. ఆయన తన ప్రసంగంలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల విషయాన్ని విస్మరించి కాంగ్రెస్ నేతృత్వంలని యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలను ఏకరవు పెట్టడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి కొత్త దిశ, దశ అందిస్తున్నారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న పథకాలతోనే పేదలు చిరునవ్వులు చిందిస్తున్నారని ఆయన అన్నారు. ప్రస్తు ప్రభుత్వంతోనే ప్రజల జీవితాల్లో మార్పు వస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన స్కామ్లకు లెక్కలేదని, వాటి వల్ల దేశ ప్రతిష్ట దెబ్బ తిందని ఆయన చెప్పారు.
కేంద్ర ప్రభుత్వంపై టిడిపి, ఇతర ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు టిడిపి ఎంపి గల్లా జయదేవ్ ప్రసంగం విన్న తరువాత అవిశ్వాసం ప్రతిపాదించాల్సిన అవసరం లేదని అనిపిస్తోందని బిజెపి ఎంపి రాకేష్ సింగ్ అన్నారు. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని ఆయన చెప్పారు. ఆ పార్టీతో కలిస్తే ఏం జరుగుతోందో కర్ణాటక ముఖ్యమంత్రి తాజాగా బహిరంగంగా ఏడ్చినప్పుడే అర్థమయిందని ఆయన అన్నారు. ఏ పార్టీ అన్యాయం చేసిందో ఆ పార్టీతో కలిసి అవిశ్వాసం పెట్టారని రాకేష్ సింగ్ టిడిపిని విమర్శించారు.