అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్రం ఏపీకి చేసిన అన్యాయంపై అనర్గళంగా దాదాపు గంటంపావు సేపు ప్రసంగించిన తెలుగుదేశం సభ్యుడు గల్లా జయదేవ్ పటేల్ మాటలను ఉటంకిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ సందర్భంగా కేంద్రం ఏపీకి అన్యాయం చేయడానికి అబద్ధాలను అడ్డు పెట్టుకుంటున్నదన్న ఆయన అబద్ధాలను అడ్డుపెట్టుకుంటే నిజాలు ఎదురు తిరుగుతాయన్న సర్దార్ పటేల్ మాటలను ఉటంకిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
ఏపీ ఏం అన్యాయం చేసిందని వివక్ష చూపుతున్నారని గల్లా జయదేవ్ అన్నారు. ఏపీకి కేటాయింపుల విషయంలో ఆర్థిక మంత్రి అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఏపీ ఎంపీలు ప్రధాని దృష్టిలో అవసరం లేని వ్యక్తులుగా కనిపిస్తుంటే..విపక్ష వైకాపా ఎంపీలు అతిథులుగా కనిపిస్తున్నారని గల్లా జయదేవ్ అన్నారు. రెవెన్యూ లోటు నుంచి రాజధాని అమరావతి వరకూ నిధుల కేటాయింపు విషయంలో ఏపీకి కేంద్రం ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేసిందన్నారు. రాజధాని నిర్మాణానికి 43వేల కోట్ల రూపాయలు కావాలని, కానీ కేంద్రం 1500 కోట్ల రూపాయలు విదిలించి చాలా ఇచ్చేశామని అన్నారు.
గల్లాజయదేవ్ అవిశ్వాస తీర్మానంపై ప్రసంగిస్తున్న సమయంలో నిర్దిష్ట కాలవ్యవధిలో ప్రసంగాన్ని ముగించాల్సిందిగా స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆయనకు సూచించారు. ఆ సందర్భంగా స్పీకర్, జయదేవ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. గల్లా జయదేవ్ తనకు ఇంకా చాలా సమయం కావాలని చెబుతూ పార్లమెంటు చరిత్రలో అవిశ్వాస తీర్మానంపై ప్రారంభ ప్రసంగాన్ని త్వరగా ముగించిన దాఖలాలు వలేవన్నారు. దీనిపై సుమిత్రా మహాజన్ స్పందిస్తూ చరిత్ర చెప్పవద్ద…చెప్పింది వినండి అని చురకవేశారు. అయితే దానిని పట్టించుకోకుండా జయదేవ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.