లోక్సభ : ఎపిలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు నిధులిచ్చారని గల్లా జయదేవ్ అన్నారు. దీనిపై ఆర్థిక మంత్రి మాట్లాడుతూ దేశంలోని 150 వెనుకబడిన జిల్లాలకు నిధులిస్తున్నామని చెప్పారని జయదేవ్ అన్నారు. ఎపిలోని ఈ ఏడు జిల్లాలు కూడా అందులోకే వస్తాయని, అటువంటప్పుడు తమకు ప్రత్యేకంగా ఇస్తున్నదేమిటని ఆయన ప్రశ్నించారు. బుందేల్ఖండ్కు ఇస్తున్న దానిలో ఎపికి ఇస్తున్న కేటాయింపులు పదవ వంతు కూడా లేవని ఆయన అన్నారు.