న్యూఢిల్లీ : అవిశ్వాన తీర్మానంపై చర్చను ప్రారంభించి ప్రసంగిస్తున్న గల్లా జయదేవ్ ను సమయం అయిపోయింది ఐదు నిముషాల్లో ముగించండని సుమిత్రా మహాజన్ సూచించారు. అయితే తనకు ఇంకా చాలా సమయం కావాలని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు చరిత్రలోనే అవిశ్వాస తీర్మానంపై చర్చను గంటలో ముగించిన సందర్భాలు లేవని జయదేవ్ అన్నారు. తనకు మరో అరగంట కావాలన్ని జయదేవ్ స్పష్టం చేసి తన ప్రసంగాన్ని కొనసాగించారు.