న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ముందు తిరుపతి వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని గల్లా జయదేవ్ అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టి ప్రసంగిస్తున్నారు. గల్లా జయదేవ్ తిరుపతిలో మోడీ హామీని ప్రస్తావిస్తున్నప్పుడు తెలుగుదేశం ఎంపీలు వెంకటేశ్వరస్వామి పటాన్ని ప్రదర్శించారు.స్పష్టత, వివక్ష, నమ్మకం ఈ నాలుగు అంశాలపైనే తాము కేంద్రంపై అ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టామని గల్లా జయదేవ్ అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఆయన మాట్లాడుతూ….విభజన కారణంగా 90శాతం విద్యాసంస్థలు తెలంగాణకు వెళ్లిపోయాయన్నారు.
విభజనతో హైదరాబాద్ ను ఏపీ కోల్పోయిందని అన్నారు. దీని వల్ల రాష్ట్రానికి ఆర్థిక వనరులు తగ్గిపోయాయన్నారు. రెండు జాతీయ పార్టీలూ కలిసి ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేశాయని గల్లా జయదేవ్ విమర్శించారు. ఈ సందర్భంగా విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన ఆరు హామీంలను ఆయన ప్రస్తావించారు. వాటిలో వేటినీ నేటి వరకూ నెరవేర్చలేదన్నారు. విభజనతో వ్యవసాయం, విద్య రంగాలలో ఏపీ వెనుకబడిందన్నారు. ఆంధ్రప్రదేశ్కు రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి అన్యాయం చేశాయని టిడిపి ఎంపి గల్లా జయదేవ్ అన్నారు. విభజనకు ముందు ఎపికి హైదరాబాద్ నుంచి సంపద ఉత్పత్తి అయ్యేదని ఆయన అన్నారు. విభజన తరువాత ఎపి అనేక రంగాల్లో తీవ్రంగా నష్టపోయిందన్నారు.