ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తలుపులు మూసి రాష్ట్రాన్ని ముక్కలు చేశారు : గల్లా జయదేవ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 20, 2018, 11:32 AM

లోక్‌సభలో గందరగోళం మధ్యే టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌ అవిశ్వాసంపై చర్చను ప్రారంభించి మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా విభజించారని గల్లా జయదేవ్‌ అన్నారు. ఎపికి భారీగా అన్యాయం చేశారని ఆయన అన్నారు.పార్లమెంట తలుపులు మూసి రాష్ట్రాన్నిఅప్రజాస్వామికంగా విభజించారని గల్లా జయదేవ్ అన్నారు. అప్రజాస్వామిక విభజన కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయిందని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించి ప్రసంగిస్తున్న గల్లాజయదేవ్..విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు విషయంలో కేంద్రం దారుణంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కాగా ఈ దశలో రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా విభజించారన్న జయదేవ్ వ్యాఖ్యలపై టీఆర్ ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


టీఆర్ఎస్ సభ్యుల నినాదాల మధ్యే జయదేవ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.  అన్ని విధాలుగా నష్టపోయిన ఏపీకి మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ న్యాయం చేయలేదని విమర్శించారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ విభజన హామీలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. అప్పులు ఏపీకీ, ఆస్తులు తెలంగాణకు ఇచ్చారన్నారు. ఎన్‌డిఎనుంచి తెలుగుదేశం బైటికి రాగానే కేంద్రం తమపై కక్ష కట్టిందని టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌ అన్నారు. ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com