న్యూఢిల్లీ : లోక్ సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని గల్లా జయదేవ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ చరిత్రలోనే ఇది ముఖ్యమైన రోజని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన భరత్ అనే నేను సినిమా కథను ప్రస్తావించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించిన గల్లా జయదేవ్ కేంద్రం ఇచ్చిన హామీలపై నిలబడాలన్నారు. అవిశ్వాసంపై చర్చను చేపట్టినందుకు స్పీకర్ కు కృతజ్ణతలు తెలిపారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ఏపీకి ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ప్రస్తుతం అవిశ్వాసంపై జరుగుతున్న చర్చను మెజారిటీకీ, మొరాలిటీకీ జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్పై పక్షపాత వైఖరి అవలంబిస్తోందని టిడిపి ఎంపి గల్లా జయదేవ్ అన్నారు. ఇది బిజెపి, టిడిపి మధ్య యుద్ధం కాదని, మోడీ ప్రభుత్వానికి, ఎపి ప్రజలకు మధ్య యుద్ధమని, ఇది ధర్మ పోరాటమని ఆయన చెప్పారు.
హోదా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్నది ధర్మపోరాటమని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఆ హక్కు కోసం రాష్ట్ర ప్రజలు చేస్తున్నది ధర్మపోరాటమన్నారు. విభజన హామీలను నెరవేర్చనందుకే బీజేపీ నుంచి బయటకు వచ్చామన్నారు. ఇప్పుడు జరుగుతున్నది తెలుగుదేశం-బీజేపీల మధ్య పోరాటం కాదనీ, మెజారిటీకి-మొరాలిటీకి మధ్య వార్ అని చెప్పారు. ఎన్డీయే నుంచి వైదొలగిన తరువాత కేంద్రం ఏపీపై కక్షకట్టిందన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారన్నారు. రాష్ట్ర విభజనే అప్రజాస్వమికంగా జరిగిందన్నారు. ఈ దశలో గల్లా జయదేవ్ ప్రసంగానికి టీఆర్ఎస్ అడ్డు తగిలింది.