అమరావతి: ప్రతి శాఖ సమాచారంతో గ్రామదర్శినికి సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రగతిపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు, విజయాలు వివరించడానికి ఒక కార్యక్రమం పెట్టాలన్నారు. అర్హతలను బట్టి లబ్ధిదారుల ఎంపిక, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇంకా ఏమేం చేయగలుగుతామనేది వివరాలు ఇవ్వాలన్నారు. అన్ని వివరాలపై వచ్చే సమావేశంలో సరైన సమాచారంతో రావాలని అధికారులకు సూచించారు. ఉపాధి కల్పన, విద్య వీటన్నింటిపై కసరత్తు చేయాలన్నారు. వచ్చే నెలలో పాడేరులో ఆదివాసీ ఉత్సవానికి ఏర్పాట్లపై చంద్రబాబు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.