న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ శశిథరూర్ ఇవాళ లోక్సభలో మాట్లాడారు. కేరళలోని తన ఆఫీసుపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. రాజ్యాంగబద్దంగా తనకు ఇచ్చిన ఆఫీసుపై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం జాతీయభావాన్ని, బహుళత్వాన్ని దెబ్బతీసేందుకు దాడులు చేస్తోందని ఆయన అన్నారు. సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్పై దాడి జరగడాన్ని కూడా ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యంలో దౌర్జన్యాలు, దాడులు పెరుగుతుంటే వాటిని సహిస్తూ ఉండలేమని అన్నారు. ఇటీవల ఎంపీ శశిథరూర్.. భారతదేశం హిందూ పాకిస్థాన్గా మారుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ బీజేవైఎం కార్యకర్తలు.. తిరువనంతపురంలో ఉన్న ఆయన ఆఫీసుపై దాడి చేశారు. ఈ అంశాన్ని ఇవాళ జీరో అవర్లో ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుపట్టారు.