లోక్సభ : ప్రభుత్వంపై టిడిపి సహా పలు పార్టీల సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసులు తనకు అందాయని స్పీకర్ చెప్పారు. అవిశ్వాస తీర్మానం నోటీసులను స్పీకర్ సభముందు ఉంచారు. తీర్మానంపై చర్చ ఎప్పుడు జరిగేదీ తేదీని, సమయాన్ని పది రోజుల్లో ప్రకటిస్తానని ఆమె చెప్పారు. కేశినేని నాని ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని స్పీకర్ సభ ముందు ఉంచారు. తీర్మానంపై చర్చకు అవసరమైన సభ్యుల సంఖ్య ఉన్నట్లు వెల్లడవడంతో చర్చకు అనుమతి ఇస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.