మహా సంప్రోక్షణ సమయంలో భక్తులను దర్శనాలకు అనుమతించాల్సిందేనని, ఆ మేరకు కార్యాచరణను రూపొందించుకోవాలని సీఎం చంద్రబాబునాయుడి నుంచి ఆదేశాలు రావడంతో ఈఓ అనిల్ సింఘాల్ అత్యవసర టీటీడీ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సమావేశంలో చైర్మన్, పాలకమండలి సభ్యులు పాల్గొంటారని తెలిపారు. సమావేశం కన్నా ముందు దర్శనాల విషయంలో భక్తుల అభిప్రాయాలను తీసుకుంటామని ఆయన తెలిపారు. మహా సంప్రోక్షణ సమయంలో దర్శనాలపై విదివిధానాలను ఈ సమావేశంలో చర్చించి ప్రకటిస్తామని వెల్లడించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా గతంలో తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని చంద్రబాబు ఆదేశించారని, ఆయన ఆదేశాల ప్రకారం బోర్డు సమావేశంలో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.