కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో 75,3324 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతోంది. తుంగభద్ర ప్రాజెక్టులో నీటి నిలువ 84 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు నుంచి 503 క్యూసెక్కుల ఔట్ఫ్లో కొనసాగుతోంది. వరద ఇదే విధంగా కొనసాగితే రెండు మూడు రోజుల్లో ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది.