చెన్నై: ఆంధ్రప్రదేశ్ ఎంపీల డిమాండ్లలో న్యాయం ఉందని డీఎంకే మంత్రి కనిమొళి అన్నారు. చెన్నైలో టీడీపీ ఎంపీలు డీఎంకే ఎంపీ కనిమొళిని కలిశారు. పార్లమెంటులో వివిధ అంశాలపై టీడీపీ ఎంపీలు మద్దతు కోరారు. ఈ సందర్భంగా కనిమొళి మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన విభజన హామీలనే వారు కోరుతున్నారన్నారు. టీడీపీకి డీఎంకే నైతిక మద్దతు ఉంటుందన్నారు.