గుంటూరు: సాంకేతికత వినియోగంలో ఏపీ అన్ని రాష్ట్రాల కంటే ముందుందని మంత్రి లోకేశ్ అన్నారు. గుంటూరులో ఎస్ఆర్ఎం వర్సిటీలో ఇంజనీరింగ్ విద్యలో సంస్కరణలు-భవిష్యత్ నైపుణ్యాలపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో లోకేశ్ మాట్లాడుతూ కొన్నాళ్లుగా రెండంకెల వృద్ధి రేటుతో ఏపీ స్థిరమైన ప్రగతి సాధిస్తోందన్నారు. నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు 15 శాతం మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. ఇంజనీరింగ్లోనే కాదు అన్ని రంగాల్లోనూ హాకథాన్ నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు సృజనాత్మకతతో ముందుకు సాగాలన్నారు. ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. ఈ ఏడాదిలోగా రాజధానిలో రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. రానున్న 2 నెలల్లో రాష్ట్రానికి మరిన్ని ఐటీ సంస్థలు రానున్నాయన్నారు.