శ్రీకాకుళం : శ్రీకాకుళంలో మత్స్యకార యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని బిజెపి నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. ఎపిలో విద్య దోపిడీకి గురవుతోందని, విద్యారంగంలో మౌలికమైన మార్పులు చేసి నెంబర్ వన్ విద్యను బిజెపి అందిస్తుందని ఆయన అన్నారు. యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చే బదులు ఉపాధి అవకాశాలు చూపించాలని ఆయన సూచించారు. యువజన సంఘాలకు మొక్కలు పెంచే పని ఇస్తే ఉపాధి దొరుకుతుందని ఆయన అన్నారు.