జగదల్పూర్ : మతం మార్చుకున్న వారికి, ముఖ్యంగా గిరిజనులకు ప్రభుత్వ పథకాలను అమలు చేయకూడదని బిజెపి పార్లమెంటు సభ్యుడు దినేశ్ కాశ్యప్ అన్నారు. మత మార్పడి పెద్ద సమస్యగా మారిందని ఆయన అన్నారు. జార్ఖండ్లో ఇటీవల మతం మార్చుకున్న 16 మందిని అరెస్టు చేసిన ఉదంతం నేపథ్యంలో కాశ్యప్ పైవిధంగా స్పందించారు. మతం మార్చుకున్న ఆదివాసీలకు ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి కలుగకుండా చూడాలని ఆయన అన్నారు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని ఆయన చెప్పారు.