ముంబైలోని జుహు బీచ్లో విషాదం చోటుచేసుకుంది. బీచ్లో సరదాగా గడుపుదామని వెళ్లిన ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తూ సముద్ర జలాల్లో మునిగిపోయారు. వారిలో ఒక యువకుణ్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగా.. మరో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ముంబైలోని గోద్రేజ్ బంగ్లా సమీపంలో జుహు చౌపట్టి బీచ్లో గురువారం (జులై 5) సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.
సహాయక బృందం రక్షించిన యువకుడి పేరు వసీం ఖాన్ (22). అతడు తెలిపిన వివరాల ప్రకారం మరో నలుగురు యువకులు సముద్ర జలాల్లో కొట్టుకుపోయారు. గల్లంతైన వారి కోసం పోలీసులు, నేవీ అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. 108 వాహనాలను సిద్ధంగా ఉంచారు. ప్రమాదం గురించి తెలుసుకొని అక్కడికి జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.