ముంబై : ఆర్థికాభివృద్ధి స్థిరత్వానికి భారతదేశం, ఎఐఐబిలు సంయుక్తంగా నిబద్ధతతో కృషి చేస్తున్నాయని ప్రధాని మోడీ చెప్పారు. భారతదేశంలో పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్ (పిపిపి) విధానాన్ని అమలు చేస్తున్నామని మోడీ అన్నారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఎఐఐబి) సమావేశంలో మోడీ ప్రసంగించారు. భారతదేశం పెట్టుబడిదారులకు ఎంతో అనుకూలమైన దేశమని ఆయన అన్నారు.