ప్రపంచ క్రికెట్ కు అరుదైన సంపద క్రికెటర్ రషీద్ ఖాన్ అంటూ ఆఫ్ఘనిస్థాన్ క్రీడాకారుడిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో భాగంగా మనకు ఆఫ్ఘనిస్థాన్ తో సంబంధాల గురించి మోదీ మాట్లాడుతూ ఈ ప్రశంసలు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు భారత్ తో ఇటీవల ఆడిన తొలి టెస్టు మ్యాచ్ విషయాన్ని, ఐపీఎల్ -11 సీజన్ లో రషీద్ రాణించిన విషయాన్ని మోదీ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే రషీద్ ఖాన్ గురించి మాట్లాడారు.