ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం సింగవరం పంచాయతీలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో రెవెన్యూ అధికారులు జేసీబీలతో గుడిసెలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. దీంతో తీరుగూడెం రోడ్డు నిర్వాసితులు అధికారులను అడ్డుకుని ఆందోళనకు దిగారు. 30 ఏళ్లుగా నివాసముంటున్న గుడిసెలను దౌర్జన్యంగా తొలగిస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. అధికారులతో గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.