విజయవాడ: విజయవాడ పవిత్ర సంగమం దగ్గర గల్లంతైన విద్యార్థుల కుటుంబాలను మంత్రి దేవినేని ఉమ పరామర్శించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి దేవినేని మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం ప్రకటించారు. ప్రభుత్వం నుంచి రూ.5లక్షలు, కాలేజీ యాజమాన్యం రూ.5లక్షల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు.