కర్నూలు జిల్లా సోమయాజులుపల్లెలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ఆరా తీసిన చంద్రబాబు క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. సోమయాజులుపల్లె వద్ద ఆటో, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.