ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం రూ.16వేల కోట్లతో పోలవరం ప్రాజెక్టు చేపట్టింది: కన్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 24, 2018, 11:46 AM

రాజమహేంద్రవరం:  కేంద్రం ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాల్లో కలిపి రూ.7వేల కోట్లతో ప్రాజెక్టులు నిర్మించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ కేంద్రం రూ.16వేల కోట్లతో పోలవరం ప్రాజెక్టు చేపట్టిందన్నారు. తామే పనులు చేపడతామని రాష్ట్రం బాధ్యత తీసుకుందని పేర్కొన్నారు. పోలవరం నిర్మాణంలో ప్రతీ పైసా కేంద్రమే భరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించినా, సహకరించకపోయినా కేంద్రమే పోలవరం నిర్మిస్తుందని గడ్కరీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com