విజయవాడ : ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. కంచికచర్ల ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ప్రవీణ్, చైతన్య, శ్రీనాథ్, రాజ్కుమార్ నదిలో స్నానానికి వెళ్లి గల్లంతైనట్లుగా పోలీసులు గుర్తించారు. ముందుగా ఒకరు స్నానానికి వెళ్లగా మునిగిపోతుండటంతో కాపాడేందుకు వెళ్లిన ముగ్గురు కూడా నదిలో గల్లంతైనట్లుగా సమాచారం. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు.