బీజింగ్: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అకస్మాత్తుగా చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి ఆమె శుక్రవారం బీజింగ్కు వెళ్లాల్సి ఉంది. అయితే చైనాలోని కమ్యూనిస్టు నేతలు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఆమె సడెన్గా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా తెలిపారు. నిజానికి తొమ్మిది రోజుల పాటు చైనా పర్యటనకు వెళ్లేందుకు మమతా ముందుగానే ప్లాన్ డిజైన్ చేసుకున్నారు. కానీ చైనా నేతలు మీటింగ్ అంశాలపై సరైన రీతిలో స్పందించకపోవడంతో ఆమె తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. కోల్కతాలోని చైనా కౌన్సులేట్ దీదీ టూర్కు ప్లాన్ చేసింది. కానీ మమతా తొందర పాటు నిర్ణయం తీసుకున్నట్లు కౌన్సులేట్ ఓ ప్రకటనలో అభిప్రాయపడింది.