గుంటూరు : నూతన టెక్నాలజీ ఉపయోగించి పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటితో కలిసి ఆయన ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేదలకు నిర్మించే గృహాల్లో ఏగ్రేడ్ టైల్స్, వంట గదికి గ్రానైట్ వినియోగిస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు.