వడోదరా: గుజరాత్లోని దారుణ ఘటన చోటుచేసుకుంది. వడోదరాలోని పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. మధ్యాహ్న సమయంలో సదరు విద్యార్థి పాఠశాలలోని వాష్రూంలో రక్తపు మడుగులో విగతజీవుడై పడి ఉన్నాడు. విద్యార్థి పొట్టపై దారుణంగా కత్తిపోట్ల గాయాలున్నాయి. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్లో గుర్గావ్లోని ఓ పాఠశాల వాష్రూంలో ఏడేళ్ల విద్యార్థి గొంతు కోయబడి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే.