విజయనగరం: మరో ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ మోడీపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు. విభజన హామీలు కేంద్రం నెరవేరుస్తుందని, అనుమానమే లేదన్నారు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పంచాయతీరాజ్కి ఇచ్చే ప్రతీ పైసా కేంద్రానివేనన్నారు. లోకేశ్ గొప్పలు చెప్పుకోవడం కోసమే ఆ శాఖ అప్పగించారని విమర్శించారు.