హైదరాబాద్ : వచ్చే ఎన్నికలలో వైకాపా ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. ఒక వేళ పవన్ తమ పార్టీకి మద్దతు ఇచ్చినా ఎన్నికలలో ఒంటరిగానే బరిలోనికి దిగుతామని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వాగ్దానాల అమలులో పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని విమర్శించారు.