జనసేన అధినేత పవన్ కల్యాణ్ వి అన్నీ గాలి మాటలని ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. విలేకరులతో మాట్లాడిన ఆయన వైకాపా, జనసేనలు వచ్చే ఎన్నికలలో కలిసి వెళతాయా లేదా అన్నది చెప్పలేమని, అయినా తన దారి ఏమిటో పవన్ కల్యాణ్ స్పష్టం చేయాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. తెలుగుదేశానికి వ్యతిరేకంగా బీజేపీ, వైకాపా, పవన్ కల్యాణ్ కుట్ర చేస్తున్నారని కేఈ ఆరోపించారు.