విజయవాడ : పవన్ కల్యాణ్, వైకాపా అధినేత జగన్ లు బీజేపీ చేతుల్లో కీలుబొమ్మలని తాము మొదటి నుంచీ చెబుతున్నామని తెలుగుదేశం నాయకుడు బోండా ఉమ అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన వైకాపా మాజీ ఎంపీ వరప్రసాద్ ఇప్పుడు ఆ విషయం బయటపెట్టారని అన్నారు. వారిద్దరూ కలిసినా తమకు వచ్చే ఇబ్బంది ఏదీ లేదని ఆయన అన్నారు. జగన్ పాదయాత్రకు జన స్పందన కరవవ్వడంతో ఆయన పవన్ కల్యాణ్ మద్దుతు కోరుతున్నారని బోండా ఉమా చెప్పారు.