ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌కే తన మద్దతని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు: వరప్రసాద్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 22, 2018, 02:11 PM

తమ పార్టీతో కలిసి పని చేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నారని వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్‌ పార్టీ బలోపేతం, ప్రజల సంక్షేమం కోసం వ్యక్తిగతంగా బాగా శ్రమిస్తున్నారని తెలిపారు. జగన్‌కే తన మద్దతు ఉంటుందని పవన్‌ చెప్పారని అన్నారు. వైసీపీతో పవన్‌ కలిసేందుకు ప్రయత్నం చేసింది నిజమేనని, చంద్రబాబు చేసే అవినీతి ఆయనకు నచ్చడం లేదని అందుకే జగన్‌తో కలిసి నడిచేందుకు సిద్ధపడ్డారని చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వడానికి పవన్‌ సిద్ధంగా ఉన్నారని కీలక విషయం తెలిపారు. 2014లో తాను చంద్రబాబుకు మద్దతిచ్చానని ఏపీ సర్కారు ప్రజలకు ఏం చేయలేదని పవన్‌ అన్నారని ఆయన తెలిపారు. అనుభవజ్ఞుడని మద్దతిస్తే ఈ నాలుగేళ్లలో ఆయన పాలనలో అవినీతి పెరిగిపోయిందని, ప్రత్యేక హోదా కూడా తీసుకురాలేదని పవన్‌ అన్నారని వరప్రసాద్‌ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com