న్యూఢిల్లీ : వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ అధికారంలోనికి వస్తామని కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ ధీమా వ్యక్తం చేశారు. లాటిమార్ లో జరిగిన భారత్-బ్రిటన్ లీడర్ షిప్ కాంక్లేవ్ ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ఢిల్లీ నుంచి లైవ్ లో మాట్లాడారు. 2019 ఎన్నికలలో బీజేపీ 300కు పైగా స్థానాలలో విజయం సాధిస్తుందన్నారు.