అమరావతి: ఇన్నోవేషన్ వ్యాలీ అంటే అమరావతి గుర్తుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి పరిధిలో రాయపూడిలో ప్రవాసాంధ్రుల ఎన్ఆర్టీ ఐకానిక్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నాలుగేళ్లలో విజ్ఞానానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. జేఈఈ పరీక్షల్లో 12 శాతం మంది తెలుగువారికి సీట్లు వస్తున్నాయని, బిట్స్పిలానీకి తెలుగువారికి 50 శాతం సీట్లు వస్తున్నాయన్నారు. విజ్ఞాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు కావాలని పేర్కొన్నారు.