తమ గ్రామం మీదగా మైనింగ్ వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించేది లేదని ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామాస్తులు పేర్కొన్నారు. బుధవారం మైనింగ్ వాహనాలను తిరగకుండా గ్రామాస్తులు రోడ్ పై ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులకు మద్దతుగా జిల్లాకార్యదర్శి దువ్వా శేషుబాబ్జీ, జనసేన కార్యకర్తలు నిలిచారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ..క్రషర్సు యాజమాన్యం ఐదు రోజులు వ్యవధి అడిగారనీ ఈ లోగా ప్రత్యామ్నాయం చూసుకోవాలని లేకపోతే మైనింగ్ వాహనాలను తిరగనిచ్చేది లేదని హెచ్చరించారు, జిల్లా అధ్యక్షులు ఆర్.ఈశ్వరరావు మాట్లాడుతూ..ఈ అక్రమ రవాణా వల్ల చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నా యాజమాన్యలు పట్టించుకోకపోవడం వల్లే ఈ ఆందోళన చేపట్టామన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు సూర్యకిరణ్ సుబ్రమణ్యం,డి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.