ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమ రవాణాలను వ్యతిరేకిస్తూ గ్రామస్తుల ఆందోళన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 20, 2018, 04:13 PM

 తమ గ్రామం మీదగా మైనింగ్‌ వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించేది లేదని ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామాస్తులు పేర్కొన్నారు. బుధవారం మైనింగ్‌ వాహనాలను తిరగకుండా గ్రామాస్తులు రోడ్‌ పై ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులకు మద్దతుగా జిల్లాకార్యదర్శి దువ్వా శేషుబాబ్జీ, జనసేన కార్యకర్తలు నిలిచారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ..క్రషర్సు యాజమాన్యం ఐదు రోజులు వ్యవధి అడిగారనీ ఈ లోగా ప్రత్యామ్నాయం చూసుకోవాలని లేకపోతే మైనింగ్‌ వాహనాలను తిరగనిచ్చేది లేదని హెచ్చరించారు, జిల్లా అధ్యక్షులు ఆర్‌.ఈశ్వరరావు మాట్లాడుతూ..ఈ అక్రమ రవాణా వల్ల చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నా యాజమాన్యలు పట్టించుకోకపోవడం వల్లే ఈ ఆందోళన చేపట్టామన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు సూర్యకిరణ్‌ సుబ్రమణ్యం,డి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com