ముఖ్యమంత్రి నాయి బ్రాహ్మణులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ వద్ద వినూత్న నిరసన తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయి బ్రాహ్మణుల పై చేసిన అనుచిత వ్యాఖ్యలు అవమానపర్చే విధంగా ఉందని అందుకు తగిన మూల్యం చంద్రబాబు చెల్లించుకోక తప్పదని నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కె ఏసుబాబు హెచ్చరించారు. సచివాలయానికి మేము రాకూడదా.. మమ్మల్ని తీవ్ర వాదులుగా పరిగణిస్తున్నారా అని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఏసు బాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్థాయిలో బిసిలను కించ పరుస్తూ మాట్లాడటం దారుణమన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి పతనం కావడం ఖాయమన్నారు. సచివాలయంలో తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన వారిని నోటికి వచ్చినట్లు నాయి బ్రాహ్మణులను అవమానించారని ఆయన విమర్శించారు. పశువులుగా భావించి తోకలను కత్తిరిస్తానని 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం గలిగిన ముఖ్యమంత్రి ఈ విధంగా దిగజారుడు తనంగా మాట్లాడటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. మా దగ్గరకు వచ్చే ప్రతి ఓటరును చైతన్య పరుస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రావిపాటి సాంబశివరావు,
జిల్లా ఉపాధ్యక్షుడు మాచర్ల శ్రీనివాసరావు, అర్బన్ అధ్యక్షుడు వల్లూరి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి టి రామకృష్ణ, జిల్లా ప్రచార కార్యదర్శి కె వెంకట్రావ్, కార్యనిర్వాహక కార్యదర్శి యెస్ నాగరాజు ..ఎల్ లక్ష్మయ్య. వై బాబూరావు. పి శ్రీనివాస్. ఎమ్ రామకృష్ణ, గుంటూరు శివ. రమేష్. గుంటుపల్లి పాండు. గుంటుపల్లి మోహన్, ఎమ్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.