అధికారం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోలేదని మెహబూబా ముఫ్తి స్పష్టం చేశారు. దీర్ఘ కాల దృష్టితోనే బీజేపీతో పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశామని సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం మెహబూబా ముఫ్తీ చెప్పారు. గవర్నర్ కు రాజీనామా సమర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆమె పాక్ తో చర్చల పునరుద్ధరణ జరగాలని కోరుతున్నామని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ లో శాంతి నెలకొనాలన్న ఉద్దేశంతోనే కాల్పుల విరమణను పొడిగించాలని కోరుతున్నట్లు చెప్పారు. అధికారంలో ఉన్న కాలంలో జమ్మూ కాశ్మీర్ పునర్నిర్మాణానికి కృషి చేశానని ఆమె చెప్పారు.