ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రస్టు ఛైర్మన్‌ పదవికి దక్కిన గౌరవం మంత్రిపదవి : ఆదేశ్‌ బందేకర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 19, 2018, 02:20 PM

ముంబై : సిద్ధివినాయక ట్రస్టు ఛైర్మన్‌కు మంత్రి హోదా కల్పించడం ఛైర్మన్‌ పదవికి లభించిన గౌరవమని శివసేన నేత, ట్రస్టు ఛైర్మన్‌ ఆదేశ్‌ బందేకర్‌ అన్నారు. మంత్రి పదవి తనకు వ్యక్తిగతంగా ఇచ్చిన హోదా కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ఛైర్మన్‌ హోదాలో ఉన్నానని కనుక తనకు మంత్రి పదవి ఇచ్చారని అంటున్నారని ఆయన అన్నారు. వాస్తవానికి ఇది తనకు వ్యక్తిగతంగా ఇచ్చిన హోదా కాదని, ఛైర్మన్‌ పదవికి ఇచ్చిన హోదా అని ఆయన అన్నారు. తాను ఎలాంటి జీతభత్యాలు తీసుకోకుండానే సేవ చేస్తానని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com