గుంటూరు: నాయిబ్రాహ్మణుల పట్ల సీఎం చంద్రబాబు తీరు ఆక్షేపణీయమనివైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ ప్రజా దేవాలయంలో చంద్రబాబు ప్రవర్తన దేవునిలా లేదన్నారు. సీఎం స్థాయి వ్యక్తి బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. నాయి బ్రాహ్మణులు చాలా సౌమ్యులు అని, అలాంటి వారిపై చంద్రబాబువీరత్వం చూపాలనుకున్నారని పేర్కొన్నారు. నాయిబ్రాహ్మణులను రాత్రి పిలిపించి బలవంతంగా సమ్మె విరమింపజేశారని విమర్శించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు పచ్చచొక్కా వేసుకోవడం మంచిదన్నారు.