ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉప ముఖ్యమంత్రితో నాయీ బ్రాహ్మణుల చర్చలు విఫలం

Andhra Pradesh Telugu |   | Published : Mon, Jun 18, 2018, 04:53 PM

ఆలయాల్లో పని చేస్తున్న క్షురకుల సమ్మెను విరమింపజేయడానికి ఎపి ప్రభుత్వం చేపట్టిన చర్యలు విఫలమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తితో నాయీబ్రాహ్మణులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీనితో వారు తమ సమ్మె కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. తమకు పిఎఫ్‌ సౌకర్యం, 15 వేల రూపాయిల కనీస వేతనం చెల్లించాలని ఆలయాల్లో పని చేస్తున్న క్షురకులు డిమాండ్‌ చేస్తున్నారు. క్షురకుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూస్తానని కెఇ వారికి హామీ ఇచ్చారు. కాగా ముఖ్యమంత్రి తమ సమస్యలను పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com