విజయవాడ : విజయవాడలోని దుర్గ గుడిలో క్షురకులు చేపట్టిన సమ్మె నాలుగవ రోజుకు చేరింది. ఆలయాల్లోని క్షురకులకు కనీస వేతనంగా 15 వేల రూపాయిలు ఇవ్వాలని, పిఎఫ్, ఇఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా నేటి మధ్యాహ్నం నాయీ బ్రాహ్మణ సంఘాల నేతలు ప్రభుత్వంతో చర్చించనున్నారు. ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి నాయీ బ్రాహ్మణ సంఘాల నేతలతో చర్చలు జరుపుతారు.