అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరు-ప్రగతి, వ్యవసాయంపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయక పోవడాన్ని నిలదీశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లిలో నిన్న జరిగిన నీతి అయోగ్ భేటీ విషయాలను చంద్రబాబు వెల్లడించారు. పంటల మద్దతు ధరలో లోపాలను చర్చనీయాంశం చేశామన్నారు. నరేగాను వ్యవసాయానికి అనుసంధానించాలని డిమాండ్ చేశామని పేర్కొన్నారు.