న్యూఢిల్లీ : ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్థానంలో లెఫ్టినెంట్ గవర్నర్ హాజరయ్యారు. లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన కేబినెట్ మంత్రులు ముగ్గురు గత ఏడు రోజులుగా బైఠాయించి నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రికి బదులుగా నీతి ఆయోగ్ సమావేశానికి లెఫ్టి నెంట్ గవర్నర్ బైజాల్ హాజరుకావడం వివాదా స్పదం అయ్యింది. లెఫ్టినెంట్ గవర్నర్ కు ముఖ్యమంత్రికి బదులుగా నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లే అధికారం ఎక్కడిదని కేజ్రీవాల్ ప్రశ్నించారు. తాన బదులుగా సమావేశానికి హాజరు కావడానికి తాను ఎవరికీ అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. ఇలా ఉండగా బీజేపీ యేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా దాదాపుగా కేజ్రీవాల్ కు సంఘీభావం ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ బైజాల్ నీతీ ఆయోగ్ సమావేశానికి హాజరు కావడాన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.